ఏపీ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యేకు ఊరట
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 07:41 PM

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గ్రానైట్‌ ఫ్యాక్టరీ తనిఖీ చేయకుండా ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతోసాంబశివరావుపై నమోదైన కేసులో పిటిషన్‌ను కోర్టు పరిష్కరించింది. ఈ పిటిషన్‌పై సీఆర్‌పీపీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకుంటామని మార్టూరు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు.. అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించారు. 41ఏ నోటీసు ఇస్తామని పోలీసులు చెబుతున్నందున పిటిషన్‌ విచారణ లోతుల్లోకి వెళ్లడంలేదన్నారు.


గ్రానైట్‌ ఫ్యాక్టరీ తనిఖీ తన విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిఘా విభాగం గనులు, భూగర్భ శాఖ ఏడీ బాలాజీనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహా పలువరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ముందస్తు బెయిలు కోరుతూ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చేయడానికి వీల్లేదని, 41ఏ నోటీసు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పిటిషనర్ తరఫు లాయర్ వివరించారు. ఆధారాలు లేకుండా అనుమానాలతో వ్యక్తుల అరెస్టు కుదరదని.. దర్యాప్తు అధికారులు సరైన కారణాలు లేకుండానే ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారన్నారు. నిందితులను మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు పంపారని.. వారంతా బెయిల్‌ పొందారన్నారు.


పర్చూరు నియోజకవర్గంలో తప్పుడు ఫాం-7 దాఖలుచేసి భారీగా ఓట్లను తొలగించడంపై ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. దానిపై ఎన్నికల సంఘం విచారణ జరిపింది.. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు సస్పెండయ్యారన్నారు. దీంతో కక్ష పెంచుకొని ఎమ్మెల్యేపై తప్పుడు కేసు పెట్టారని.. ఆ సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవే అన్నారు. నేర తీవ్రత తక్కువ.. పిటిషనర్‌కు ముందస్తు బెయిలు ఇవ్వండి లేదా 41ఏ నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించాలన్నారు. ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చేయాలా లేక 41ఏ నోటీసు ఇవ్వాలా అన్నది దర్యాప్తు అధికారి విచక్షణాధికారం అన్నారు పోలీసుల తరఫు లాయర్. నోటీసు తప్పనిసరేం కాదు. ఇందుకు పోలీసులను బలవంతం చేయొద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది అన్నారు. ఈ కేసులో సోమవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో ప్రచురించారని.. అవి పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని అదనపు పీపీ జడ్జి దృష్టికి తెచ్చారు.


పత్రికల్లో వచ్చే వార్తలను ఎలా నిలువరించగలం? అని దీనిపై న్యాయమూర్తి స్పందించారు. వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉన్నాయన్నారు సర్క్యులేషన్‌ పెంచుకునేందుకు అనేక కథనాలు వస్తుంటాయని.. తనకు వ్యతిరేకంగానూ వార్తలొచ్చాయన్నారు.. వాటిపై స్పందించలేనన్నారు. పత్రికల్లో ప్రచురించిన వార్తలు పరువునష్టం కలిగించేవైతే.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టనిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోర్టులో విచారణ ప్రక్రియపై వార్తలు రాస్తుంటారని సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అన్నారు.

Latest News
Mumbai's Stasya Pandya clinches dual Team medals at Delhi Horse Show 2026 Sat, Apr 04, 2026, 12:30 PM
'Why are you asking me?': Kohli responds to 'overseas player' tag with humour Sat, Apr 04, 2026, 12:09 PM
Armed miscreants attack relatives of Bihar Agriculture Minister in Patna Sat, Apr 04, 2026, 12:03 PM
Pakistani forces killed another Baloch student in Balochistan: Rights group Sat, Apr 04, 2026, 11:59 AM
Attack on Tharoor's security, fake surveys signal Left's desperation: LoP Satheesan Sat, Apr 04, 2026, 11:35 AM