రాజ్యసభ వైస్‌ ఛైర్మన్‌గా వైసీపీ ఎంపీ
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:04 PM

రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం అరుదైన ఘనత దక్కించుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ కుర్చీలో ఆసీనులై, ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా సభను నడిపించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాజ్యసభ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌ హోదాలో.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ స్థానంలో కూర్చొని సభను సజావుగా నడిపించారు. 2018, ఏప్రిల్లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ నెలతో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభ్యులుగా ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఇటీవల ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆయన ఛైర్మన్‌ స్థానంలో ఆసీనులై సభను నడిపించారు.

Latest News
No structured modules: Lone actors drive India’s terror threat Wed, Apr 29, 2026, 03:03 PM
Bangladesh pacers surge in ODI rankings after series win over NZ Wed, Apr 29, 2026, 03:00 PM
Rajasthan HC extends Asaram's interim bail till May 25 on medical grounds Wed, Apr 29, 2026, 02:59 PM
China blocks Meta's $2 billion AI deal, flags security concerns Wed, Apr 29, 2026, 02:48 PM
Bengal polls: Brisk voting underway, 61.11 pc recorded in first six hours Wed, Apr 29, 2026, 02:47 PM