|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:21 AM
పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బాలశౌరి మండిపడ్డారు. దమ్ము, దైర్యంతో గొంతు ఎత్తే వ్యక్తి పవన్ అని చెప్పుకొచ్చారు. పవన్తోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుకే రాష్ట్రంలో కొద్దో.. గొప్పో ప్రజాస్వామ్యం అమలు అవుతోందన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. జగన్ ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అమరావతి రాజధానికి ప్రతిపక్షంలో ఉండగా జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు.
Latest News