నేడు ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:12 PM

ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధా­న్య­మిస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్‌ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆద­ర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలి­సిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైయ‌స్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించను­న్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యా­యా­­నికి నాంది పలుకు­తు­న్నారు. విజయ­నగరం, ఏలూ­రు, రాజమహేంద్ర­వ­రం, మచిలీప­ట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటై­న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజ­యనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM