|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:42 PM
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను తట్టుకోలేక 23 మంది మరణించినట్లు, వారి మరణం బాధాకరమని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భావోద్వేగాలకు గురికాకుండా ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటించాలన్నారు. రాజకీయ కక్షతోనే ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో ధర్మమే గెలుస్తుందన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు.
Latest News