|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 10:26 AM
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలోని నెత్తివారంపల్లి గ్రామానికి చెందిన నరేంద్రప్రసాద్ పై టిడిపికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు తెలిపిన మేరకు చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని టీడీపీ నాయకులు ఆనంద్, నాగభూషణ, బాల నరసింహులు ఆదివారం మూకుమ్మడిగా నరేంద్ర ప్రసాద్ పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
Latest News