పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరైన రాజ్కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 21న డుంకీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ఇప్పుడు ఈ చిత్రం 161 నిమిషాల (2 గంటల 41 నిమిషాలు) రన్ టైమ్ కి లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశంలో అడ్వాన్స్లు రేపటి నుండి ప్రారంభమవుతాయి అని సమాచారం.
ఈ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ లో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరానీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరానీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa