టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా ఈ సినిమా కోసం సంజయ్ దత్ 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తాజా సమాచారం. 60 రోజుల కాల్షీట్లు అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పూర్తి పాత్రలో కనిపించనున్నాడు.
ఇటీవలే చిత్ర బృందం ముంబైలో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ త్వరలో ఫారిన్ లొకేషన్లో ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియా సినిమా మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో మార్చి 8, 2024న విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa