ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు..

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 11:56 AM

టీటీ ప్లాట్ ఫామ్స్ పై మండిపడింది బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్. ఓటీటీల వల్ల చిన్న పిల్లలు చెడిపోతున్నారని. ఈ విషయంలో త్వరగా మేలుకోపోతే.. సమాజానికి మంచిది కాదన్నారు అమీషా.. ఇంతకా ఆమె ఇంకా ఏమంటున్నారంటే..? బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వెండితెరను ఒక ఊపుఊపి వదిలిపెట్టింది హీరోయిన్ అమీషా పటేల్. ఇక ప్రస్తుతం సీనియర్ యాక్ట్రస్ గా అడపా దడపా సినిమాలు చేసుకుంటుంది. ఇక ఆమె రీసెంట్ గా నటించిన గదర్ 2 సినిమా.. మరో నెల రోజుల్లో  రిలీజ్ కాబోతోంది. ఈసినమాపై  బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో సన్నిడియోల్‌గా జోడీగా నటించింది  అమీషా పటేల్‌.  ఇక తజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటీటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలల్లో క్లిన్ కంటెంట్ ఉండట్లేదని ఆరోపించింది.   ప్రస్తుతం ఓటీటీల్లో క్లీన్ కంటెంట్ కంటే కూడా.. స్వలింగ సంపర్కం, గే-లెస్బియానిజం ఎక్కువైపోయిందంటూ.. సంచల కామెంట్స్ చేసింది అమీషా. అంతే కాదు ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలని.. కాని అవి పిల్లలకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని.. అమీషా పటేల్ వెల్లడించింది. ఇక అందుకే పిల్లలు చూసేందకు  మంచి కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే యుగం ఇది కాదని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa