యోగేశ్వర్, అతిథి జంటగా, దర్శకుడు సాయి శివాజీ రూపొందించిన చిత్రం "పరారి". శ్రీ శంకర్ ఆర్ట్స్ బ్యానర్ పై జి వి వి గిరి ఈ సినిమాను నిర్మించగా, గాలి ప్రత్యూష సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. లేట్ మ్యూజిక్ కంపోజర్ చక్రి గారి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా నుండి 'ఏమో ఏమో' అనే లవ్ డ్యూయెట్ సాంగ్ కి సంబంధించిన ఫుల్ వీడియో విడుదలయ్యింది. సింగర్స్ సాయి చరణ్, సురభి శ్రావణి ఆలపించిన ఈ పాటకు చల్లగాలి సాహిత్యం అందించారు. పోతే, ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa