నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మార్చి 22న ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.
ఈ విలేజ్ డ్రామాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa