ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న చిత్రం "గీత సాక్షిగా". ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు కాగా, చేతన్ రాజ్ మైసూరియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ శ్రోతలను అలరిస్తుండగా, తాజాగా ఈ రోజు ఎవరు నువ్వు అనే సోల్ ఫుల్ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ సినిమా మార్చి 22న తెలుగు, హిందీ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa