డైరెక్టర్ ఆంథోనీ మట్టిపల్లి డైరెక్షన్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం "గీతసాక్షిగా". బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, భరణి శంకర్ కీలకపాత్రల్లో నటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక మెస్మరైజింగ్ లవ్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. జనవరి 6వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు 'అడుగులో అడుగునై' డ్యూయెట్ సాంగ్ విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. విశేషమేంటంటే, ఈ పాటను యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చెయ్యనున్నారు.
చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు కథను కూడా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa