పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో "అన్స్టాపబుల్ విత్ NBK S 2" లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ ఎపిసోడ్ యొక్క షూటింగ్ నిన్న జరిగింది. పోతే, ఈ ఎపిసోడ్ షూటింగ్లో బాలయ్య పవన్ ని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అకిరా నందన్ ని పెట్టి తమ్ముడు సినిమా సీక్వెల్ తీయొచ్చుగా, అకిరాని త్వరగా లాంచ్ చెయ్యొచ్చుగా అని అడుగుతారు. అలానే ఈ ఎపిసోడ్ లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గా హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. పవన్ మ్యానరిజం చెయ్యమని బాలయ్య తేజ్ ని అడగ్గా, పవన్ ఆశీస్సులు తీసుకుని మరీ తేజ్ ఇమిటేట్ చెయ్యడం విశేషం. అలానే తనని ఇమిటేట్ చెయ్యమని కోరగా, వెంటనే లేచి తొడకొడతారట. పవన్ కళ్యాణ్ వీరభక్తుడు బండ్ల గణేష్ వాడే ఫేమస్ డైలాగ్ ఈశ్వరా.. పవనేశ్వరా.. ని బాలయ్య నోటి వెంట వినడం అభిమానులకు మహదానందాన్ని ఇచ్చే అంశం. ఇంకా ఇలాంటి ఎన్నో సరదా సంఘటనలు, రసవత్తరమైన ప్రశ్నలు ఈ ఎపిసోడ్ లో చాలానే ఉన్నాయి. మరి, అతి త్వరలోనే ఆహా సంస్థ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చెయ్యనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa