ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజే టిల్లు జోడిగా మళ్ళీ ఆ హీరోయిన్ పేరు పరిశీలనలో ..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 08:41 PM

చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్న సినిమా "డీజే టిల్లు". యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో డీజే టిల్లు సీక్వెల్ పై అంతటా ఆసక్తి నెలకొంది.


ఐతే, మొదటి నుండి కూడా ఈ సినిమా హీరోయిన్ విషయంలో అసంతృప్తికరమైన వార్తలే విన్పిస్తున్నాయి. రాధికగా డీజే టిల్లు తో రొమాన్స్ చేసి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన నేహశెట్టిని కాదని, మేకర్స్ శ్రీలీలను సీక్వెల్ లో హీరోయిన్ గా మొదట అనుకున్నారు. కానీ ఆ అవకాశం అనుపమ పరమేశ్వరన్ ను వరించింది. ఐతే, ఆ తరవాత అనుపమ కూడా ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలొచ్చాయి.  ఆ తరవాత మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి.. పేర్లు వినిపించాయి కానీ... తాజాగా మేకర్స్ మల్లు బ్యూటీ అనుపమనే తిరిగి ఈ సినిమాలోకి తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. మరి, అనుపమ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందో.. లేదో చూడాలి..!! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa