కన్నడ బ్యూటీ రష్మిక మందన్న పుష్ప: ది రైజ్ సినిమా ఘన విజయం తర్వాత నార్త్ లో కూడా ఈ బ్యూటీ కి ఫుల్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ బాలీవుడ్ లో మిషన్ మజ్ను అండ్ గుడ్బై అనే రెండు సినిమాలలో నటించింది. గుడ్బై సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా డిసెంబర్ 2, 2022న నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్కి అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో అమితాబ్ మరియు రష్మిక తండ్రీకూతుళ్లుగా నటించారు. ఈ చిత్రంలో నీనా గుప్తా, పావైల్ గులాటి, సునీల్ గ్రోవర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వికాస్ బహ్ల్ , ఏక్తా కపూర్, శోభా కపూర్, విరాజ్ సావంత్ మరియు సరస్వతి ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.తో కలిసి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa