టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ కి సినీప్రేమికుల నుండి భారీ స్పందన లభించింది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ వారంలో విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వెల్లడించారు. ఈ పాటలో చిరు చేసిన డ్యాన్స్కి తాను ఫిదా అయ్యానని, ఎగ్జైట్మెంట్లో ఈ వార్తను లీక్ చేశానని చెప్పాడు. ఈ పాటకు బాస్ పార్టీ అని పేరు పెట్టినట్లు సమచారం. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగారావు గా ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa