రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ తన 25వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి 'జపాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నవంబర్ 14న ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సునీల్ విలన్గా నటిస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa