దర్శకుడు పా రంజిత్తో స్టార్ హీరో విక్రమ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. డిసెంబర్ 2021లో ప్రకటించబడిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 3డిలో చిత్రీకరిస్తునట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. 1800ల నాటి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ ని టైమ్స్ మ్యూజిక్ 5 కోట్లలకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ రానున్న రోజులలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa