కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు సంచలనం సృష్టించాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. చిల్లా చిల్లా అనే టైటిల్తో రూపొందిన ఈ పాటను గిబ్రాన్ కంపోజ్ చేసారని, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిరుధ్, ఈ పాట తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని అజిత్ అభిమానులకి ఫుల్ జోష్ ఉంటుంది అని చెప్పారు.
ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడని సమాచారం. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa