ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ 'తునివు' కు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన మంజు వారియర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 08:57 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమా అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది.


తాజాగా ఈరోజు మంజు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసి ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్లు సమాచారం. ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం


సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa