ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసిన 'NC22' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 06:21 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టెంపరరీగా 'NC 22' అనే టైటిల్‌ ని పెట్టారు.


ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో ప్రియమణి,అరవింద్ స్వామి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్ , ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa