మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతుంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ సినిమా గురించి రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది. పైగా రేణు తన సన్నివేశాల స్క్రిప్ట్ను కూడా పోస్ట్ చేసింది. ఇక ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది.
ఎంతైనా టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పైగా రవితేజ హీరో.. కాబట్టి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం. మరి రవితేజకు ఈ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడు అనేది చూడాలి. సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట. దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa