తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వారసుడు కథకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నలుగురు అన్నదమ్ముల జర్నీ నేపథ్యంలో తెరకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా కనిపించనుండగా, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ మరియు శ్రీకాంత్ అతని సోదరులుగా కనిపించనున్నారు. వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం 'సంక్రాంతి' తరహాలో ఈ సినిమా ఉండనుంది అని లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఈ సినిమాని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa