ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ తో భేటీ ఐన కార్తీ, నాజర్... ఎందుకంటే

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 04:26 PM

టాలీవుడ్ కి MAA (మూవీ ఆర్టిస్ట్స్ అస్సోసియేషన్) ఎలానో కోలీవుడ్ కి నడిగర్ సంఘం అలా. ఇటీవలే నడిగర్ సంఘ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఎన్నికల్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు నాజర్ అధ్యక్షుడిగా గెలుపొందగా, హీరో కార్తీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. నడిగర్ సంఘానికి ఇప్పటివరకు మంచి భవనం లేదు. దీంతో నడిగర్ నూతన భవన నిర్మాణ విషయాన్ని చర్చించేందుకు నాజర్, కార్తీలు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. గత కొంతకాలంగా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న రజినీ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్తీ, నాజర్ లు రజినీని కలవడం ఆసక్తిని సంతరించుకుంది. అయితే వీరు నడిగర్ భవన నిర్మాణ విషయంలో చర్చలు జరిపేందుకు సమావేశమయ్యారని తెలిసిన తర్వాత తమిళ తంబీలు శాంతపడ్డారు. ఈ సమావేశంలో నడిగర్ భవన నిర్మాణానికి సంబంధించి రజిని నాజర్, కార్తీలకు కొన్ని దిశానిర్దేశాలు చేసారని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa