బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ధాకడ్ ఇటీవల థియేటర్లలో విడుదలై ఘోరపరాజయం పాలయ్యింది. గూఢచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు రజనీష్ ఘాయ్ ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఏజెంట్ అగ్ని పాత్రలో నటించిన కంగనా కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ ను, బాలీవుడ్ హీరోలను తలదన్నుతూ కంగనా చేసిన పోరాట సన్నివేశాలు చేసి సినిమాను ఒంటిచేత్తో థియేటర్లకు మోసుకొచ్చింది. ఎక్కడ లోపం జరిగిందో తెలియదు కానీ, మే 20న రిలీజైన ధాకడ్ చిత్రం తొలి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు కరువయ్యారు. పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా నిర్మాతలకు తిరిగి రాకపోగా, పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు.
ధాకడ్ మూవీ రిజల్ట్ తో కళ్ళు తెరిచిన 'తేజస్' మేకర్స్ థియేటర్లలో కాకుండా ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడించనున్నారట. నటీనటులకు, దర్శక నిర్మాతలకు చిత్రసభ్యులందరికీ మంచి జరగాలంటే తేజస్ ను ఓటిటిలో రిలీజ్ చెయ్యడమే మంచిదని భావిస్తున్నారట. సర్వేష్ మేవారా దర్శకత్వంలో కంగనా లీడ్ రోల్ లో నటించిన చిత్రం తేజస్. ఇందులో కంగనా భారతీయ ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలట్ గా నటిస్తుంది. రోనీ స్క్రూవాలా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa