సైరా పరిహారం విషయంలో చిరంజీవి అబద్దాలు చెప్పారని, రామ్ చరణ్ నిజాలు చెప్పారని రకరకాల కన్ఫ్యూజన్స్ ఉయ్యాలవాడ వంశీకుల ఆరోపణల్లో కనిపించే సరికి అందరికీ సందేహం వచ్చింది. కోర్టుకు కుంటి సాకులు చెప్పారు. తాజాగా హైకోర్టు సైరా విడుదలకు కేసు కొట్టేసి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అయితే ఈ కేసు వెనక కొందరుండి నడిపిస్తున్నారని చిరంజీవి ప్రకటించిన నేపథ్యంలో అటు వైపుగా సినీ జనాలు దృష్టి సారించారు. అయితే ఉయ్యాల వాడ వంశీకులను వెనక నుంచి తమిళనాడు తెలుగు సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ముందుకు నెడుతున్నాడని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. ముందు బయోపిక్ అని తర్వాత మాట మార్చి చరిత్ర అంటున్నారని ఇటీవల కోర్టులో పిటీషన్ వేసిన ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది.
సైరా చిత్రంలో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది. గతంలో చాలా చరిత్రలు సినిమాగా తెరకెక్కాయని ఉదహరించింది. చరిత్ర నేపథ్యం గల సినిమాలు చేసేటప్పుడు అడ్డు చెప్పే అధికారం కోర్టుకు లేదని తెలిపింది. చరిత్రను వక్రీకరించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయని కుండబద్దలు కొట్టింది కూడా రామ్ గోపాల్ వర్మలా వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటుగా మారిందని అందుకే మెగా ఫ్యామిలీ పై బురద చల్లేందుకు కేతిరెడ్డి ఇదంతా చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మొత్తం వివాదానికి అతనొక్కడే కారణమని మెగా ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు.
కాగా సినిమాను కేవలం వినోదపరంగానే చూడాలని సూచించింది. సినిమా చూడాలా.. లేదా? అన్నది ప్రేక్షకుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సినిమా విడుదలకు తమకు అభ్యంతరం లేదని ఉయ్యలవాడ వంశస్తులు వెనక్కి తగ్గటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa