దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరుగనున్నట్లు ఇటీవల లీకులు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం జూన్లో 15–20 శాతం వరకు టారిఫ్లు పెరగే అవకాశం ఉంది. చివరిసారి ఈ మార్పు 2024లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థల్లో జరిగింది. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇంకా ప్లాన్లలో మార్పు చేయలేదు.
*కొత్త ధరలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? జియో హాట్స్టార్ (JioHotstar) కీలక ప్రకటన చేసింది. సూపర్ మరియు ప్రీమియం ప్లాన్లలోనే ధరల్లో మార్పులు చేసినట్లు, ఈ కొత్త ధరలు కేవలం కొత్త యూజర్లకు వర్తిస్తాయని తెలిపింది. ఈ ధరలు జనవరి 28 నుండి అమల్లోకి రానున్నాయి.
-రూ.79 రీఛార్జ్ ప్లాన్ : జియో హాట్స్టార్ రూ.79 నెలవారీ ప్లాన్ను ప్రారంభించింది. ఇది కేవలం మొబైల్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు నెలల ప్లాన్ ధర రూ.149, వార్షిక ప్లాన్ ధర రూ.499. ఈ ప్లాన్లో ఒకసారి ఒకే మొబైల్లో సబ్స్క్రిప్షన్ను వినియోగించవచ్చు.
-సూపర్ ప్లాన్లు : సూపర్ ప్లాన్లో నెలవారీ రీఛార్జ్ రూ.149, మూడు నెలల ప్లాన్ రూ.349, వార్షిక ప్లాన్ రూ.1099. ఈ ప్లాన్లో ఒకేసారి రెండు డివైజ్లలో కంటెంట్ వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
-ప్రీమియం ప్లాన్లు : ప్రీమియం నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ.299, మూడు నెలల ప్లాన్ రూ.699, వార్షిక ప్లాన్ రూ.2199. ఈ ప్లాన్లో గరిష్టంగా 4 డివైజ్లలో కంటెంట్ వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ యాక్సెస్ పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa