సీనియర్ నటి శిల్పా శిరోద్కర్కు ఆమె సోదరి, మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చారు. 2025 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నమ్రత నేరుగా దుబాయ్ వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్న తన చెల్లి శిల్పను అకస్మాత్తుగా కలిశారు. అక్క రాకతో సంతోషంలో మునిగిపోయిన శిల్ప, ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.ఈ ఫొటోలో అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే రకమైన తెలుపు రంగు దుస్తుల్లో (ట్విన్నింగ్) మెరిసిపోతూ కెమెరాకు పోజులిచ్చారు. "2025కి వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి మార్గం ఉండదు. దుబాయ్లో నా డార్లింగ్ సిస్టర్ సర్ ప్రైజ్ విజిట్ చేసింది. లవ్ యూ మై డియరెస్ట్ చిన్.. ఐ లవ్ యూ సో మచ్" అంటూ శిల్ప క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై నమ్రత కూడా రెడ్ హార్ట్ ఎమోజీలతో స్పందించారు. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్లోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శిల్ప.. ఇటీవల తన స్నేహితుడు, బిగ్బాస్ 18 విజేత కరణ్ వీర్ మెహ్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కరణ్తో దిగిన సెల్ఫీలను షేర్ చేస్తూ.. "నాకు ఇష్టమైన వ్యక్తికి బర్త్డే విషెస్. నువ్వు లేకుండా బిగ్బాస్ జర్నీ ఇంత సరదాగా ఉండేది కాదు. నీ విజయాల పట్ల గర్వంగా ఉంది" అంటూ పోస్ట్ చేశారు. బిగ్బాస్ 18 గ్రాండ్ ఫినాలేకి కొద్ది రోజుల ముందే శిల్ప ఎలిమినేట్ కాగా, కరణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa