ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు పాత్రలు డిఫరెంట్ గా ఉండటమే అందుకు కారణం. ఆయన నుంచి వచ్చిన 'లవ్ టుడే' డ్రాగన్' సినిమాలు హిట్ కొట్టడం మరో కారణం. రీసెంటుగా ఆయన నుంచి వచ్చిన 'డ్యూడ్' సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా మమితా బైజూ సందడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ తమిళ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఓ మాదిరిగా ఆడొచ్చు అనే చాలామంది అనుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక మరో విశేషం ఏమిటంటే, 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఓటీటీ హక్కులు 25 కోట్లు పలకడం. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa