పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘ఎ’ సర్టిఫికేట్ను పొందింది. సినిమాలోని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.సోమవారం జరిగిన సెన్సార్ కార్యక్రమాల అనంతరం, బోర్డు సభ్యులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు కొన్ని మార్పులు సూచించారు. అనంతరం సినిమా తుది నిడివిని 2 గంటల 34 నిమిషాల 15 సెకన్లుగా (154.15 నిమిషాలు) ఖరారు చేశారు. చిత్రంలో అధిక స్థాయిలో హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డు పలు యాక్షన్ ఘట్టాలలో మార్పులు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, ధూమపానం చేసే సన్నివేశాల్లో వాయిస్ ఓవర్తో పాటు హెచ్చరికల ప్రదర్శన తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ సూచనలన్నింటినీ చిత్ర యూనిట్ పాటించడంతో సెన్సార్ క్లియరెన్స్ లభించింది.ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ఒకరోజు ముందుగానే, అంటే 24వ తేదీన, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. తెలంగాణలో రాత్రి 9 గంటలకు, ఆంధ్రప్రదేశ్లో రాత్రి 10 గంటలకు ఈ ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధిత ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా ఈ చిత్రంలో చూపించనున్నారని, విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాలను మరింత పెంచాయి. తాజా సెన్సార్ రిపోర్ట్తో సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతోందోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa