సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా పఖ్వాడా పక్షోత్సవాల్లో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు విస్తృత సేవా, క్రీడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పక్షోత్సవాల సందర్భంగా యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లోని భారతీయ మిషన్లు వికసిత్ భారత్ రన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆధ్వర్యంలో జర్మన్ ఫుట్బాల్ ప్రధాన కేంద్రమైన డ్యూయిషర్ ఫుట్బాల్ బాండ్ ప్రాంగణంలో ఈ పరుగును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ప్రవాస భారతీయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ప్రగతికి తమ మద్దతును ప్రకటించారు.
క్రీడలు