☼ Suryaa News
🔴 జాతీయం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారు
జాతీయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారు

09 Sep 2026 vasu

వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్
ముంబై: భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం "దాదాపుగా" ఖరారైందని, త్వరలోనే ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. ముంబైలో జరుగుతున్న 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026' సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇరుపక్షాలకు పరస్పర ప్రాధాన్యతా మార్కెట్ ప్రవేశం (Preferential Market Access) కల్పించే చట్రంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. రెండు దేశాల వ్యాపార వర్గాలు ఈ పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, భారత్-చిలీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందాన్ని బహుశా అక్టోబర్‌లో అమలులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అగర్వాల్ చెప్పారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారత్ ఎగుమతులు 15 ശాతానికి పైగా పెరిగాయని వివరించారు. అలాగే, అంతర్జాతీయ రెమిటెన్స్ (విదేశీ నగదు బదిలీ) రుసుములను 5-6 శాతం నుండి 3 శాతానికి తగ్గించడం ద్వారా భారతీయ వలస కార్మికులకు అదనంగా 5 బిలియన్ డాలర్ల ప్రయోజనం చేకూరుతుందని, భారత్ తన డిజిటల్ ఫిన్‌టెక్ సేవల ఎగుమతులను గణనీయంగా పెంచుకునేందుకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home