☼ Suryaa News
🔴 అంతర్జాతీయం భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం
అంతర్జాతీయం

భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం

17 Sep 2026 vasu

ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోని పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/రోమ్: భారత్, ఇటలీ దేశాలు తమ గాఢమైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ పరస్పర సహకారం, శ్రేయస్సుతో కూడిన భవిష్యత్తును కలిసి నిర్మిస్తున్నాయని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

తన మిత్రుడు ప్రధాని మోదీకి ఆరోగ్యకరమైన, విజయవంతమైన జీవితాన్ని ఆకాంక్షిస్తున్నట్లు మెలోని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలోనూ, క్రియాశీలక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధాని మోదీకి వివిధ ప్రపంచ దేశాల అధినేతల నుండి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home