సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: నటుడు, దర్శకుడు కునాల్ ఖేము తెరకెక్కించిన తాజా చిత్రం 'వైబ్' బాక్సాఫీస్ వద్ద పపర్వాలేని వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా దేశీయ మార్కెట్లో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 2.25 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో కునాల్ ఖేముతో పాటు ప్రముఖ నటి ప్రీతి జింటా, స్పర్ష్ శ్రీవాస్తవ, వంశిక ధీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
కునాల్ ఖేము గతంలో దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ప్రెస్' చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.63 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టగా, తాజా చిత్రం 'వైబ్' ఆ సంఖ్యను అధిగమించడం విశేషం. సినిమాకు సంబంధించి విడుదలైన ప్రెస్ రిలీజ్ ప్రకారం, ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెకిన ఈ చిత్రంలో నటీనటుల అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వినోదాత్మక అంశాలతో పాటు విభిన్న పాత్రల ప్రయాణంగా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని యూనిట్ భావిస్తోంది. బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.