ప్రజలందరికి..
వినాయక చవితి శుభాకాంక్షలు
గణనాథుని కరుణతో ప్రజలకు సుఖసంతోషాలు
ఎస్సై సూర్యనారాయణరెడ్డి..
వల్లూరు మేజర్ న్యూస్
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆయన ఆశీస్సులు పొందాలని వల్లూరు ఎస్సై సూర్యనారాయణరెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వల్లూరు మండల ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, ఆ గణనాథుని దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..