రామగిరి మేజర్ న్యూస్: పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి అని , ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అని రామగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం రామగిరి మండలం నసనకోట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లీప్ యాప్ నందు పాఠశాల ప్రగతికి సంబంధించిన విషయాలను ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల సమిష్టి ప్రగతికి, పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది తోడ్పాటు అందించాలి అని, తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాల బోధనా తీరు, పాఠశాల కార్యక్రమాలను లీప్ యాప్ నందు నమోదు చేసి పాఠశాల ప్రగతిని పెంచాలని సూచించారు.అలాగే పదవ తరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించి, మన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కు, పాఠశాల కు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జమున బాయి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.