తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు -మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు

Select Suryaa Now
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్:   భూకబ్జాల పేరుతో .. తన పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని 48వ డివిజన్  మాజీ  కార్పొరేటర్  శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 48వ డివిజన్ నుంచి ఇటీవలే టిడిపిలో చేరిన మోహన్ , ఇతరులు అనవసర, లేనిపోని ఆరోపణలతో.. తనపై బురదజల్లే ప్రయత్నంను మానుకోవాలన్నారు. నీవు చెప్పేది శ్రీరంగా నీతులు, చేసే వేదవ పనులన్నీ డివిజన్ ప్రజలందరికీ తెలుసు అన్నారు. నీ చరిత్ర ఏ పోలీస్ స్టేషన్లో రికార్డులు, భూకబ్జా బాధితుల వివరాలు అడిగితే  చాలు చెబుతారన్నారు. నాపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని శ్రీనివాసులు సవాల్ చేశారు. నగరపాలక సంస్థ  పూడికతీత పనులను చేపడితే... సొంత డబ్బుతో చేసినట్లు ప్రచారం ప్రచారం చేసుకుంటున్నావు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. 48వ డివిజన్ తో  సంబంధం లేకపోయినా.. ఏళ్ల తరబడి ఇక్కడే నివాసం ఉన్నట్లు... ప్రజా సమస్యలపై మాట్లాడడం హాస్యస్పదమన్నారు.  ఇటీవలే నిర్వహించిన కార్యక్రమానికి కాలనీలో ఎవరు ఎవరితో ఎంతెంత వసూలు చేశావో.. సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రోత్సహించడం చూసి.. అమ్మో అని ప్రజలు భయపడుతున్నారని శ్రీనివాసులు విమర్శించారు.  ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజల్ని భయపెట్టే పరిస్థితికి రావద్దని ఆయన హెచ్చరించారు. డివిజన్ ప్రజలకు ఎవరి చరిత్ర ఏమిటో అంతా తెలుసునన్నారు.  ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి ప్రసన్న లక్ష్మి , నగర మహిళా కార్యదర్శి సైలజ, యూత్ లీడర్ శ్రీకాంత్ , ట్రేడ్ యూనియన్ నగర సెక్రటరీ రహమతుల్లా,   డివిజన్ బీసీ సెల్ నాయకులు హరికృష్ణ పాల్గొన్నారు.