andhrapradesh
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఇరువురికి రక్త గాయాలు
రూరల్ మండల పరిధిలోని సంతేబిదనూరు గ్రామంలో ఓ భూమి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇరువురికి రక్త గాయాలు అయిన సంఘటన చోటు చేసుకుంది.ఈ సందర్భంగా సంతేబిదనూరు రెవిన్యూ పొలంలో గ్రామానికి చెందిన జయ రంగప్ప. పెద్ద రాజప్ప కుటుంబాలకు సంబంధించిన సాగు భూములు కలవు. ఇరువురు రైతుల భూముల్లోకి వెళ్లడానికి రహదారి వివాదం నెలకొంది. రహదారి వివాదం పరిష్కారం కోసం సర్వే చేయాలని జయ రంగప్ప కుటుంబ సభ్యులు భూమి సర్వే చేయడానికి చలానా కట్టారు. అయితే శుక్రవారం పెద్దరాజప్ప కుటుంబ సభ్యులు తమ పొలములోకి వెళ్లడానికి రహదారి ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న జయరంగప్ప కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని సర్వే చేసే వరకు రహదారి ఏర్పాటు చేయకూడదని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణకు తలబడ్డారు.ఇరు వర్గాల ఘర్షణలో రామంజి. హనుమంతప్పలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఇరవర్గాల ఘర్షణకు ఎలాంటి సంబంధం లేని అబూబకార్ అనే వ్యక్తిని కూడా ఓ వర్గం వారు చితకబాదారు.
వెంటనే సమీపవాసుల జోక్యం చేసుకొని బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ వర్గానికి చెందిన రామంజి అనే బాధితుడు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం తమ సమీప బంధువైన జయ రంగప్ప సాగుభూమికొన్నారని ఆ భూమిలో పంటల సాగు చేసుకుని కుటుంబ జీవనాలు సాగిస్తున్నామన్నారు. తమ గ్రామానికి చెందిన పెద్దరాజప్ప. ఆవులప్ప కుటుంబ సభ్యులకు కూడా తమ భూమి సమీపంలోనే సాగు భూమి కలదని ఆ భూమిలోకి వెళ్లడానికి తమ భూమి సమీపంలో రహదారి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారన్నారు. మీ భూమిలోకి వెళ్లడానికి దారి లేదని వేరే దారి చూసుకోవాలని వారికి నచ్చ చెప్పామని వారు వినకపోవడంతో భూమి యొక్క రహదారి కోసం సర్వే చేయాలని చాలానా కట్టడం జరిగిందన్నారు. అయితే సర్వే చేసి కొలతలు వేయకుండానే వారు ఇష్ట రాజ్యాంగ రహదారి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారని దీన్ని తాము అడ్డుకుంటే తమపై దాడి చేశారని ఆరోపించారు.ఆవులప్ప.
పెద్ద రాజప్ప కుటుంబానికి సంబంధించిన హనుమంతప్ప మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము భూమి కొనుగోలు చేసి పంటలు సాగు చేసి కుటుంబ జీవనాలు సాగిస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జయ రంగప్ప భూమి సమీపంలోనే తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుండవారమని అయితే ఇటీవల కాలంలో తమ పొలానికి వెళ్లడానికి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.తమకు ఉన్న సమాచారం మేరకు తమ పొలంలోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేసుకుంటే ఇది జీర్ణించుకోలేని రామంజి వారి కుటుంబ సభ్యులు తమపై దాడులు చేసి గాయపరిచారని విమర్శించారు. అబూబకర్ అనే బాధితుడుమాట్లాడుతూతమనీటి కొళాయి కి సంబంధించిన సామాన్లు తెచ్చడానికి గ్రామం వైపు వెళుతుండగా ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారు.ఇరు వర్గాల ఘర్షణ తనకు ఎలాంటి సంబంధం లేదు.అయితే అనవసరంగా రామంజి కుటుంబ సభ్యులు తనను విపరీతంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
