ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో సాలుమరద తిమ్మక్క మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 03:46 PM

ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ‘వృక్షమాత’గా పేరుగాంచిన సాలుమరద తిమ్మక్క (114) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రకృతిని ప్రేమించి, వేలాది మొక్కలను నాటి వాటినే తన పిల్లలుగా భావించి పెంచిన ఆమె మరణంతో పర్యావరణ ఉద్యమానికి తీరని లోటు ఏర్పడింది.కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో 1911 జూన్ 30న తిమ్మక్క జన్మించారు. వివాహమైన తర్వాత 25 ఏళ్ల వరకు సంతానం కలగకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ బాధను అధిగమించి తన జీవితాన్ని పర్యావరణ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తన భర్తతో కలిసి మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మొక్కలు నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ సస్యశ్యామలం చేశారు.ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa