ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు కష్టాలు చెప్పుకున్న ఐటీ కంపెనీ సీఈవో.. మంత్రి లోకేష్ నుంచి ఊహించని రిప్లై

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 05:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ లండన్‌లో పర్యటిస్తున్నారు.. పెట్టుబడుల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ చేతల్లో చూపిస్తున్నామని.. 15 నెలల మా పాలనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ, డాటా సిటీలతో ఏపీ రూపురేఖలు మార్చబోతున్నాంమని.. పరిశ్రమల స్థాపనకు అడ్డుగా ఉన్న నిబంధనలు సవరిస్తున్నామన్నారు. అయితే లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీ సీఈవో తన సమస్యను చెబుతూ ట్వీట్ చేయగా.. విశాఖపట్నం వచ్చేయమంటూ మంత్రి లోకేష్ స్వాగతం పలికారు.


'బెంగళూరు ఔటోర్ రింగ్ రోడ్డు (బెలందూర్)కు దగ్గర మా కంపెనీ ఉంది.. తొమ్మిదేళ్లు ఆఫీసు, ఇల్లు.. ఇలా కంటిన్యూ చేయాలంటే చాలా, చాలా కష్టంగా ఉంది. అందుకే మేము అక్కడి నుంచి మూవ్ (అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లాలని) కావాలని అనుకుంటున్నాము. మా కంపెనీలో ఉద్యోగులు ఆఫీస్‌కు వెళ్లాలంటే కనీసం గంటన్నర సమయం పడుతోంది. ఆ రోడ్డు మొత్తం గుంతలమయం, దుమ్ముతో నిండిపోయి ఉంది.. చాలా దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో ఎలాంటి మార్పు లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాజేష్ అనే బ్లాక్ బక్ కంపెనీ సీఈవో ట్వీట్ చేశారు.


వెంటనే ఈ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ రిప్లై ఇచ్చారు. ' హాయ్య రాజేష్.. ఒకవేళ మీకు ఇంట్రస్ట్ ఉంటే విశాఖపట్నానికి మీ కంపెనీని రీ లొకేట్ (విశాఖపట్నానికి వచ్చేస్తారా) అని అడిగారు. విశాఖపట్నం దేశంలో ఐదు పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఉంది. బెస్ట్ ఇన్ క్లాస్ సకల సౌకర్యాలతో భవనాలు ఉన్నాయి. మహిళలకు రక్షితమైన నగరంగా (ఉమెన్ సేఫెస్ట్ సిటీ) విశాఖపట్నం ఉంది. మీరు ఓసారి నాకు మెసేజ్ చేయండి అంటూ మంత్రి నారా లోకేష్ కోరారు. మరి ఆ కంపెనీ సీఈవో లోకేష్ ట్వీట్‌కు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అయితే ఆ కంపెనీని బెంగళూరులోనే మరోచోటికి షిఫ్ట్ అయ్యే ఉద్దేశంతో సీఈవో బాలాజీ ట్వీట్ చేశారా?.. అసలు బెంగళూరు నుంచి దూరంగా వెళ్లాలని అలా ట్వీట్ చేశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి లోకేష్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు.. ఈ క్రమంలో ఇటీవల ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు స్పందించారు.. ఓ యాడ్‌పై స్పందించిన లోకేష్.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా సంస్థను ఆహ్వానించారు. అప్పుడు ఆ ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa