ఆసియా కప్ 2025 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవుతోంది. ఆసియా కప్ పేరు వినగానే భారత్ - పాక్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూసే అభిమానుల్లో పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ కూడా ఒకడు.
భారత్ - పాకిస్తాన్ జరుగుతుందా? లేదా? అన్న టెన్షన్లో అందరూ ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నెలకొనడంతో ఆ ప్రభావం క్రికెట్పై కూడా పడింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో పాకిస్తాన్తో జరగాల్సిన సెమీఫైనల్స్ మ్యాచ్ని సైతం భారత జట్టు వద్దనుకుంది. పాక్తో ఆడేందుకు అస్సలు ఇష్టం చూపలేదు. దాంతో ఈ ఆసియా కప్లో సెప్టెంబర్ 14న జరగాల్సిన మ్యాచ్ పరిస్థితి ఏంటో అన్న టెన్షన్ నెలకొంది.
రాజకీయాలను క్రీడల్లోకి తీసుకురావొద్దని.. మ్యాచ్ జరగాలి, ఆట ఆగిపోవడం కరెక్ట్ కాదంటూ వసీం అక్రమ్ అన్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 14న గ్రూప్ ఏలో భాగంగా భారత్ - పాక్ తలపడనున్నాయి. గత నెలలో షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి ఈ మ్యాచ్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
"ఆసియా కప్ షెడ్యూల్ బయటకు వచ్చింది. వ్యతిరేక స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్లో మేము శాంతంగానే ఉన్నాం. ఆడినా బాగనే ఉంటుంది, ఆడకపోయినా బాగానే ఉంటుంది. కానీ ఆట ఆగకూడదు. రాజకీయాలు వేరు, నేను రాజకీయ నాయకుడిని కాదు. వాళ్లు వాళ్ల దేశభక్తితో ఉంటారు, మేము మా దేశభక్తితో ఉంటాం. బిలో ద బెల్ట్ వెళ్లొద్దు. నా జీవతకాలంలో భారత్ - పాక్ మధ్య కనీసం ఒక్క టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది" అని వసీం అక్రమ్ అన్నాడు.
ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ను ప్రకటించేందుకు ఆగస్టు 19న ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతారా? అని జర్నలిస్టులు అడగ్గా, వెంటనే మీడియా మేనేజర్ జోక్యం చేసుకుని ఆ ప్రశ్నను అడ్డుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa