ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో మూడు మ్యాచ్లు ముగిసే సరికి భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. ఆడిన మూడింట్లో కేవలం రెండో టెస్టులో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో సిరీస్పై ఆశలు నిలుపుకోవాలంటే నాలుగో టెస్ట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జులై 23 నుంచి ఈ మ్యాచ్ మాంచెస్ట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత బృందం అక్కడికి చేరుకుని.. ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే నాలుగో టెస్ట్కు ముందు తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో విఫలమవుతున్నాడు. ఆడిన మూడు టెస్ట్లలో అతడు కేవలం 131 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. అత్యధిక స్కోరు 40గా ఉంది. మంచి ఆరంభాలు లభించినా అతడు దాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో అతడిని నాలుగో టెస్ట్ తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడి ప్లేసులో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ను తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
ఇక మాంచెస్టర్లో చివరి మూడు రోజులు స్పిన్ బౌలర్లకు అనూకులంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు కోరుతున్నారు. అతడు వికెట్ టేకర్ అని.. ఇంగ్లాండ్ను ఓడించాలంటే తప్పకుండా ఆడించాలని సూచిస్తున్నారు. అయితే అతడిని ఎవరి ప్లేసులో తుది జట్టులోకి తీసుకోవాలో.. తెలియక టీమ్ మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతోంది.
మరోవైపు ఈ సిరీస్లో బుమ్రా కేవలం మూడు టెస్ట్లు మాత్రమే ఆడతానని చెప్పాడు. ఇప్పటికే రెండు టెస్ట్లు ఆడాడు. ప్రస్తుతం సిరీస్లో భారత్ వెనకబడి ఉన్నందున నాలుగో టెస్ట్లో అతడిని ఆడిస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఓడిపోతే.. సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది. అది జరగకుండా ఉండాలనే బుమ్రా కచ్చితంగా ఆడాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జులై 23 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa