ఆదిలాబాద్ జిల్లాలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ జిమ్లో డ్రగ్స్ అందుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం దాడి చేశారు. మంచి బాడీ కావాలంటే ఇవి తీసుకోవాలంటూ అక్కడ కొందరు సూచించడంతో.. మారుమూల జిల్లాల్లోనూ ఈ డ్రగ్ కల్చర్ పెరుగుతోంది.
ఆదిలాబాద్లోని ఓ జిమ్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు, మధ్యాహ్నం తర్వాత సోదాలు నిర్వహించారు. పోలీసుల దాడుల్లో భారీగా డ్రగ్స్, స్టెరాయిడ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తెప్పించిన డ్రగ్స్, స్టెరాయిడ్స్, విటమిన్ టాబ్లెట్స్ పేరున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిమ్ను సీజ్ చేసిన పోలీసులు.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు అదే దానిపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్లో కూడా ఇవాళ పలువురు సాఫ్టవేర్ ఇంజినీర్లను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ చేపట్టిన డకాయ్ ఆపరేషన్లో గంజాయిని కొనుగోలు చేస్తూ వీళ్లు పట్టబడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువురు డెంటల్ టెక్నీషియన్లు, విద్యార్థులు కూడా ఉండటం విశేషం. దాదాపు రెండు గంటల పాటు ఈగల్ టీమ్ నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో 86 మంది వరకు పట్టుబడ్డారు. బాయ్ బచ్చా ఆగయా అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది.
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. హైదరాబాద్లో ఈగల్ టీమ్ డేగ కన్ను వేసి డ్రగ్స్ దందాను గుట్టు రట్టు చేస్తోంది. తాజాగా మల్నాడు కిచెన్ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల కుమారులను సైతం అరెస్ట్ చేశారు. మల్నాడు కిచెన్ యజమాని సూర్య డ్రగ్స్ సప్లయర్స్తో కీలకంగా వ్యవహరించాడు. రెస్టారెంట్లతో పాటు పబ్స్కు కూడా డ్రగ్స్ను సప్లయ్ చేయడమే కాకుండా.. హైదరాబాద్లోని కొందరు ప్రముఖుల ఇళ్లకు సైతం డోర్ డెలివరీ చేశారనే సమాచారం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa