వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వేధిస్తోందని ఆరోపించారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కూటమి విధానాలే కారణమని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్పు కాదని రోజా పేర్కొన్నారు.
రోజా మాట్లాడుతూ, ఏ పార్టీ నాయకుడైనా తమ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడం సహజమని, అలాంటి పరిస్థితుల్లో జగన్ను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. ‘ప్రజాదరణ కలిగిన నేతను అడ్డుకోవాలని చూడటం రాజకీయంగా సమంజసం కాదు’ అని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలతో వైసీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు.
ఈ విషయంలో పోలీసుల తీరును రోజా తప్పుబట్టారు. జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్చుకోలేక కూటమి ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతును అడ్డుకోవడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa