ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బౌండరీలతో దద్దరిల్లిన స్టేడియం.. ఐపీఎల్ 2025లోనే హైయెస్ట్ స్కోర్

sports |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 09:00 PM

చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్‌‌లో ఊచకోత కోసింది. ఇప్పటి వరకు 200 పరుగులు చేయడానికే నానా తంటాలు పడ్డ సీఎస్కే.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే సీఎస్కే హైయెస్ట్ స్కోర్ క్రియేట్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్లు హిట్టింగే లక్ష్యంగా వీరబాదుడు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు.


అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే బ్యాటర్లు.. బౌండరీల మోత మోగించారు. ఓపెనర్ ఆయుష్ మాత్రే రెండో ఓవర్‌లోనే ఏకంగా 28 పరుగులు బాదాడు. పవర్‌ ప్లేలో ఏకంగా 68 పరుగులతో ఐపీఎల్‌లో తన బెస్ట్‌ని ఈక్వల్ చేసింది.


ఆయుష్ మాత్రే కేవలం 17 బంతులే ఆడి మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు బాదాడు, దేవాన్ క్వానే 35 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఉర్విల్ పటేల్ కూడా 19 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు బాదేసి వెళ్లిపోయాడు. శివమ్ దుబే 8 బంతుల్లో రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. 13.3 ఓవర్లలోనే సీఎస్కే 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.


డివాల్డ్ బ్రెవిస్, రవీంద్ర జడేజా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బౌండరీలతోనే డీలింగ్ చేశారు. బ్రెవిస్ బౌండరీలే లక్ష్యంగా ఆడగా, జడేజా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతున్నాడు. వీరిద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ కలిపి ఐదో వికెట్‌కు ఏకంగా 74 పరుగులు జోడించారు.


డివాల్డ్ బ్రెవిస్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. 23 బంతులు ఆడి నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటయ్యాడు. రవీంద్ర జడేజా 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో సీఎస్కే ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో సీఎస్కేకి ఇదే హైయెస్ట్ స్కోర్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa