మన దగ్గర ఓ మాట బాగా వినిపిస్తుంటుంది. ఎంత నమ్మితే అంత మోసపోతాం. తాజాగా కూకట్పల్లిలో వెలుగు చూసిన ఓ సంఘటన చూస్తే ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న ఓ వ్యక్తి.. సమయం చూసి భారీ దెబ్బేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్ల రూపాయల బంగారంతో జంప్ అయ్యాడు. అతడిని నమ్మి బంగారం అప్పగించిన వారంతా లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు చేరి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వివరాలు..
కూకట్పల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నితీష్ జైన్ అనే వ్యక్తి.. సుమారు 15 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా నటిస్తూ.. చివరకు అదును చూసి.. 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారంతో ఉడాయించాడు. ప్రగతి నగర్లో చేతన్ జ్యూవెలర్స్ అనే షాప్ పెట్టి.. గత 15 ఏళ్లుగా బంగారం ఆభరణాల తయారీ, అమ్మకం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చాడు నితీష్.
15 ఏళ్లుగా అక్కడే ఉండటంతో ఆ చుట్టుపక్కల బంగారం షాపు యజమానులతో అతడికి మంచి పరిచయం ఏర్పడింది. అలా పరిచయం ఏర్పడిన వారి వద్ద నుంచి నితీష్ బంగారాన్ని తీసుకుని.. ఆభరణాలు తయారు చేసి.. కస్టమర్లకు అమ్ముతుండేవాడు. నమ్మకంగా ఉంటూ ఆ ప్రాంతంలోని దుకాణాదారులందరికి దగ్గరయ్యాడు నితీష్ జైన్.
అంతేకాక నితీష్ జైన్.. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వడ్డీలకు ఇస్తుండే వాడని బాధితులు తెలిపారు. స్కీంలు కూడా పెట్టి వారిని ఆకర్షించాడు. ఇలా కేపీహెచ్బీ, బాచుపల్లి పరిధిలో నితీష్ తన వ్యాపారాన్ని సాగించాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ తాజాగా సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారంతో పరారయ్యాడు నితీష్ జైన్. ఈ నెల 10వ తేదీ నుంచి అతడు దుకాణం తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
భారీ మొత్తంలో అతనికి బంగారం ఇచ్చిన నగల దుకాణాదారులు మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక గతంలో కూకట్పల్లిలో నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంటికే కన్నమేసి భారీగా నగదు, బంగారం ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు, బంగారం దొంగిలించారు.
![]() |
![]() |