విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్కు పరిచయం అక్కర్లేని పేరు. తన సారథ్యంలో భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ప్లేయర్.. ఆ తర్వాత సీనియర్ పురుషుల జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. దిగ్గజ ప్లేయర్గా ఎదిగాడు. హేమా హేమీ క్రికెటర్లకు సైతం సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు. పరుగుల రారాజుగా పేరు లిఖించుకున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్న ఈ ప్లేయర్.. తన కెరీర్లో తాను ఎదుర్కొన్న కఠినమైన వివరాలను వెల్లడించాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్టు, వన్డే, టీ20లకు సెపరేట్గా బౌలర్ల పేర్లను చెప్పుకొచ్చాడు. అయితే వన్డేలకు స్పిన్నర్, పేసర్ అంటూ ఇద్దరి పేర్లను వెల్లడించాడు. ఈ నలుగురు ప్లేయర్లే తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టారని విరాట్ తన మనసులోని మాటను చెప్పేశాడు.
టెస్టు క్రికెట్లో తాను ఎదుర్కొన్న కఠినమైన . ఇంగ్లాండ్కు చెందిన బౌలర్ జేమ్స్ అండర్సన్ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇదే సమయంలో టీ20 క్రికెట్లో ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న, వెస్టిండీస్కు చెందిన సునీల్ నరైన్ పేరును వెల్లడించాడు. ఇక వన్డేల్లో ఇద్దరు బౌలర్ల పేర్లను విరాట్ ప్రస్తావించాడు. పేసర్ల విషయానికి వస్తే వన్డేల్లో లసిత్ మలింగ తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్కు చెందిన ఆదిల్ రషీద్.. వన్డేల్లో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టాడని విరాట్.. ఓ కార్యక్రమంలో తెలిపాడు.
కాగా టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన తర్వాత ఆ ఫార్మాట్కు కోహ్లీ రిటైర్మెంట్ పలికాడు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడు భారత్ తరఫున కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో 63.29 సగటుతో 443 రన్స్ చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa