ఐపీఎల్ 2025లో వర్షం అంతరాయం కలిగించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్లో ఓవర్లను కుదించారు. ఈ మ్యాచ్ను 14 ఓవర్ల చొప్పున ఆడించాలని అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పగించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం కారణంగా సుమారు రెండు గంటల పాటు ఆట ఆలస్యమైంది. ఎట్టకేలకు వర్షం తగ్గడంతో ప్రపంచంలోనే అత్యద్భుత డ్రైనేజీ సిస్టమ్ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో.. నిమిషాల వ్యవధిలోనే మైదానాన్ని సిబ్బంది సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే సుమారు రెండు గంటల పాటు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో ఓవర్లను కుదించారు. ఈ మ్యాచ్ను 14 ఓవర్ల చొప్పున నిర్వహించాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు.
ఈ 14 ఓవర్లలో ముగ్గురు బౌలర్లు గరిష్టంగా నాలుగేసి ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయొచ్చు. మరో బౌలర్ రెండు ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. దీంతో ఈ మ్యాచ్లో కేవలం నలుగురు బౌలర్లతోనే ఆయా జట్లు బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాప్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న గ్లెన్ మ్యాక్స్వెల్ను పంజాబ్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి ప్లేసులో మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం.. సేమ్ టీమ్తో బరిలోకి దిగింది.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 33 మ్యాచులు జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్.. 17 మ్యాచులలో గెలిచింది. ఆర్సీబీ 16 మ్యాచులలో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మూడు మ్యాచులలో ఆర్సీబీనే విజయం సాధించడం గమనార్హం.
తుది జట్లు..
ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్యా, నేహాల్ వధేరా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, బార్ట్లెట్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
![]() |
![]() |