ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్కిన్సన్స్ వ్యాధిపై కీలక విషయాలు కనుగొన్న ఆస్ట్రేలియా పరిశోధకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 01:57 PM

పార్కిన్సన్స్ వ్యాధిపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను మార్చేసే కీలక ఆవిష్కరణను ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని రక్తనాళాల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తాయని, ఇదే వ్యాధి ముదరడానికి ప్రధాన కారణమని వారు తేల్చారు. ఈ పరిశోధన భవిష్యత్తులో పార్కిన్సన్స్‌కు కొత్త చికిత్సా మార్గాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇప్పటివరకు పార్కిన్సన్స్‌కు మెదడులో ఆల్ఫా-సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ పేరుకుపోవడమే కారణమని భావించేవారు. అయితే, ఆస్ట్రేలియాలోని న్యూరోసైన్స్ రీసెర్చ్ ఆస్ట్రేలియా  సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రోటీన్ల కంటే మెదడులోని రక్తనాళాల్లో చోటుచేసుకునే మార్పులే వ్యాధి తీవ్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తేలింది. "సంప్రదాయకంగా పరిశోధకులు ప్రోటీన్లు, నరాల కణాల నష్టంపైనే దృష్టి పెట్టారు. కానీ, మేము మెదడులోని రక్తనాళాల వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపించగలిగాం" అని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డెర్యా డిక్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa